డీజిల్ ట్యాంక్ పేలి ఎగసిపడ్డ మంటలు..

by  |

దిశ, ఖ‌మ్మం : లారీ రన్నింగ్‌లో ఉండగానే డీజిల్ ట్యాంకు ఊడిపోయి రోడ్డుపై ప‌డ‌టంతో మంట‌లు భారీగా ఎగసిప‌డిన ఘ‌ట‌న ఆదివారం మ‌ధ్యాహ్నం ఖ‌మ్మం జిల్లా నేల‌కొండ‌ప‌ల్లికి స‌మీపంలో చోటుచేసుకుంది. విజ‌య‌వాడ నుంచి మ‌హారాష్ట్ర‌కు వెళ్తున్న లారీ డీజిల్ ట్యాంకు ఒక్క‌సారిగా ఊడిపోయి రోడ్డుపై ప‌డింది. ఆ స‌మ‌యంలో వెనుక నుంచి ఎలాంటి వాహ‌నాలు ఎక్కువగా రాలేదు.దీంతో పెను ప్రమాదం త‌ప్పింది. అయితే రోడ్డుపై ప‌డిన వెంట‌నే ట్యాంకు ప‌గిలిపోవ‌డం.. వేగంతో రోడ్డును ఢీకొన‌డంతో నిప్పు చెల‌రేగి మంటలు భారీగా ఎగసి పడ్డాయి. దీంతో క్ష‌ణాల్లో డీజిల్ విస్తరించిన వరకు మేర‌కు మంట‌లు వ్యాప్తి చెందాయి. అయితే, స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు విఫ‌ల‌య‌త్నం చేశారు.


Next Story