దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి !

by  |
దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి !
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ సర్కార్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. జంగారెడ్డిగూడెంలో అభిలాష్‌కు శిరోముండనం చేయడం నీచమైన చర్య అని, రూ.30వేల కోసం శిరోముండనం చేయడం కిరాతకంగా అభివర్ణించారు. మూడు నెలల్లోనే ముగ్గురికి శిరోముండనం చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చివేత, పట్టాభి కారు ధ్వంసం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలని.. 175 నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed