మెడలు వంచుతామని..సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు !

by  |
Chandrababu
X

దిశ, వెబ్‌డెస్క్: పదిసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖ రైల్వేజోన్‌కు నిధులు, కడప ఉక్కు పరిశ్రమ, పెట్రోలియం కాంప్లెక్స్, తొలి ఏడాది ఆర్థిక లోటు కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అడిగారా అన్నారు. ఆరోజేం చెప్పారు ? ఈరోజేం చేస్తున్నారని నిలదీసిన చంద్రబాబు… అప్పుడు మెడలు వంచుతామని చెప్పి, ఇప్పుడు సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారన్నారు. జగన్ ఢిల్లీ టూర్ కేసుల మాఫీ కోసమా ? రాష్ట్ర ప్రయోజనాల కోసమా అని ప్రశ్నించారు. బుధవారం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో టీడీపీ గెలుపుతో వైసీపీ దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.

Next Story

Most Viewed