- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
Aishwarya: యుద్ధానికి నో చెప్పండి.. పాకిస్తాన్ వాళ్లను చంపొద్దంటూ టాలీవుడ్ బ్యూటీ సెన్సేషనల్ పోస్ట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

దిశ, సినిమా: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు రోజురోజు తీవ్రంగా మారుతున్నాయి. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతులో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. అలాగే హైదరాబాద్లో ఉండే జనాలు సైతం ఎప్పుడు పాకిస్తాన్ వాళ్లు బాంబుల దాడి చేస్తారో అని భయపడిపోతున్నారు. అయితే దీనంతటికీ కారణం గత నెల జరిగిన ఉగ్రదాడిలో ఏకంగా భారతీయులు 26 మంది చనిపోవడంతో యావత్ భారత్ ఎదురుదాడికి సిద్ధమయ్యారు. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలతో పాటు భారతీయులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈక్రమంలో.. కొంతమంది యుద్ధానికి, భారతీయ సైనికులకు సపోర్ట్గా పోస్టులు పెడుతుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. తాజాగా, టాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) ఇన్స్టా్గ్రామ్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టింది. యుద్ధం చేయకుండా శాంతి యుతంగా ఉండాలని చెప్పడంతో నెట్టింట దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇండియాలో ఉండి సైనికులకు అండగా ఉండాల్సింది పోయి ఇలాంటి పోస్ట్ పెట్టడం ఏంటనీ ఏకి పారేస్తున్నారు. అందులో ఏముందంటే.. ‘‘యుద్ధానికి నో చెప్పండి. ప్రజాస్వామ్య దేశ సిటిజన్గా నేను భారత్, పాక్ దేశాలకు యుద్ధం బదులుగా శాంతిని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అర్థం చేసుకునే దిశగా చర్యలు తీసుకుందాం. అనవసరమైన ప్రాణనష్టాన్ని నివారించండి. సైనికులు, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, అమాయక ప్రజలు ఈ యుద్ధఃలో చనిపోకూడదు. ఈ సందేశం అందరికీ చేరనివ్వండి’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఇండియా పాకిస్తాన్ జెండాలను షేర్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా.. ఇటీవల ఐశ్వర్య రాజేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ హిట్ సాధించింది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.