మా ఎయిర్‌‌బేస్‌లపై అటాక్ చేశారు.. భారత్‌పై పాక్ తీవ్ర ఆరోపణలు

by Shiva |   ( Updated:2025-05-10 01:07:16.0  )
మా ఎయిర్‌‌బేస్‌లపై అటాక్ చేశారు.. భారత్‌పై పాక్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ లక్ష్యంగా చేసుకున్న దాయాది పాక్ ఫతాహ్-1. ఫతహ్-2 మిస్సై్ల్స్‌ను ప్రయోగించింది. అయితే ఆ క్షిపణులు లక్ష్యం చేరకముందే ఇండియన్ ఆర్మీ అడ్డుకుని గాల్లోనే బ్లాస్ట్ చేసింది. పాక్ మిస్సైల్స్‌ను ఆకాశ్, బరాక్-8 సిస్టమ్స్ సమర్ధవంతంగా అడ్డుకున్నాయి. హర్యానా ప్రాంతంలోని సిర్సాలో పాక్ క్షిపణి కూలినట్లుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్, భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. తమ మూడు వైమానిక స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేసినట్లుగా ప్రకటించింది. రావల్పిండిలోని నూర్‌ఖాన్ వైమానిక స్థావరంపై దాడులు చేసిందని పేర్కొంది. మురిద్, రఫీఖీ వైమానిక స్థావరాలపై భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసిందని ఆరోపించింది. భారత క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుందని తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో మరోవైపు కరాచీ ఎయిర్‌పోర్ట్‌ను లాక్‌డౌన్ చేశారు. ఆ ఎయిర్‌పోర్టులో ఉన్న ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. తమ వైమానికి స్థావరాలకు పెద్దగా ఆస్తి నష్టం జరగలేదని పాక్ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అయితే, భారత్ ఊహించని దెబ్బతో పాక్ తమ ఎయిర్ స్పెస్‌ను బ్లాక్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.



Next Story

Most Viewed