- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చిల్లర దేశం చిల్లర పనులు..పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై శిఖర్ దావన్ ఫైర్

దిశ, వెబ్ డెస్క్: దేశంలో జరిగిన పహల్గామ్ ఘటనతో పాక్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు భారత్ ఉగ్రస్థావరాలపై మిస్సైల్ దాడి చేసిన సంగతి తెలిసిందే.భారత్ దాడులు చేయడంతో పాకిస్థాన్ సైతం ఎటాక్స్ మొదలు పెట్టింది. పాక్ సరిహద్దుల్లో ఉన్న సామాన్యులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడింది. దీంతో కొందరు సరిహద్దుల్లోని ప్రజలు మరణించారు. ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రతరం అవ్వడంతో అమెరికా మధ్యలో వచ్చి కాల్పుల విరమణ చేసేలా చేసింది.
అయితే భాారత్ కాల్పుల విరమణ చేసినప్పటికీ పాకిస్థాన్ కాల్పులు జరపడంతో పాటూ డ్రోన్ దాడులకు యత్నించింది. ఆర్మీ అలర్ట్ అవ్వడంతో ప్రమాదం తప్పింది. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్గంఘించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత క్రికెటర్ శిఖర్ దావన్ కూడా ఘాటుగా స్పందించారు. చీప్ దేశం మరోసారి తన నీచబుద్ధిని పూర్తి ప్రపంచానికి చూపించింది. అంటూ శిఖర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. యుద్దం జరుగున్న సమయంలో కూడా శిఖర్ భారత్ కు మద్దతుగా పలు ట్వీట్స్ చేస్తూ దేశభక్తుల్లో ఉత్సాహాన్ని నింపాడు.