- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆపరేషన్ సిందూర్ పై ఆర్జీవీ సెన్సేషనల్ పోస్ట్.. ఆమె నిజంగానే మోదీకి చెప్పింది అంటూ సెటైరికల్ కామెంట్

దిశ, వెబ్డెస్క్: జమ్మూకశ్మీర్లో పహల్గామ్ వద్ద అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా టూరిస్టుల్లో జంటలుగా ఉన్న వారి వద్దకు వెళ్లి భర్తలను మాత్రమే చంపి, టూరిస్టు మహిళలను మాత్రం టెర్రరిస్టులు వదిలేశారు. ఆవేదనతో తనను కూడా చంపమని ఓ మహిళ కోరగా.. ‘నిన్ను చంపం.. ఓట్లేసి గెలిపించుకున్నారుగా వెళ్లి మోదీకి చెప్పు’ అంటూ కిరాతకంగా రక్తపాతం పారించారు. ఈ ఘటనతో యావత్ భారత్ భగ్గుమంది.
మరోవైపు చనిపోయిన భర్త పక్కన దీనంగా కూర్చుని ఏడుస్తున్న మహిళ ఫొటో ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సర్వత్రా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ ఉగ్రమూకలపై విరుచుకుపడింది. ఈ ఆపరేషన్లో భారత సైన్యం పీవోకే (పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్) తో పాటు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసింది. దీనిపై భారతీయులు అందరూ హర్షం వ్యక్తం చేశారు.
భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై దేశ ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అదేవిధంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖులంతా భారత సైనికుల ధైర్య సాహసాలను అభినందిస్తూ ఆపరేషన్ సిందూర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, తారక్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లాంటి ప్రముఖులంతా సైనికులకి మద్దతు తెలుపుతూ పోస్ట్ చేశారు.
ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ పాక్ ఉగ్రవాదులపై సెటైరికల్ కామెంట్ చేశారు. “పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు ఓ మహిళ భర్తను చంపి… ‘మోదీకి చెప్పు’ అని వెళ్లారు. ఇప్పుడు ఆ మహిళ నిజంగానే మోదీకి చెప్పింది” అంటూ ఎక్స్ (ట్విట్టర్) లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది.