- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ కు రాజాసింగ్ లేఖ.. వాళ్ళను తరిమేయండి
తెలంగాణ ( Telangana) రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ( Cm revanth reddy) బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Rajasingh) లేఖ రాశార

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ( Telangana) రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ( Cm revanth reddy) బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Rajasingh) లేఖ రాశారు. హైదరాబాద్-పాతబస్తీలో ( Hyderabad-Old Town ) చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా నివసిస్తున్న అక్రమ వలసదారులపై ( Illegal immigrants ) వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ లిఖితపూర్వక వినతి పత్రం పంపారు. అలాంటి వ్యక్తులను గుర్తించి వీలైనంత త్వరగా వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు రాజాసింగ్.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో... అక్రమ చొరబాటుదారులను ఇప్పుడే వెళ్లగొట్టాలని రాజాసింగ్ పేర్కొన్నారు. అలా అయితేనే తెలంగాణను కాపాడుకోగలుగుతామని... సూచనలు చేశారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాలని.. కోరారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న తరుణంలోనే ఈ పనిపై దృష్టి పెట్టాలని సూచనలు చేశారు రాజాసింగ్.






