- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాల్పుల విరమణపై వివరించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టాలి: ఎమ్మెల్సీ కవిత
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత ఆర్మీ పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. అనంతరం పాకిస్తాన్ భారత్ పైకి ప్రత్యక్ష దాడికి దిగడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత ఆర్మీ పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. అనంతరం పాకిస్తాన్ భారత్ పైకి ప్రత్యక్ష దాడికి దిగడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు మూడు రోజుల పాటు ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం తో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. దీంతో ప్రస్తుతం ఇరు దేశాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కాగా ఈ కాల్పుల విరమణ (ceasefire)పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కల్వకుంట్ల కవిత (Kavitha) స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "మన దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు నేను నా నివాళులు అర్పిస్తున్నాను.
ఇంత ధైర్యంగా ఉండి దేశాన్ని రక్షించినందుకు సాయుధ దళాలను కూడా నేను అభినందిస్తున్నాను. ఈ మొత్తం కాల్పుల విరమణ ఫలితం భారతదేశం- పాకిస్తాన్ మధ్య శాంతి అయితే.. మనం దానిని స్వాగతించాలి. కానీ అది భారతదేశం-పాకిస్తాన్ మధ్య అమెరికా జోక్యం ముందుకు సాగితే.. మనం చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. కానీ ఈ సమస్యలన్నింటినీ మన భారతీయులందరికీ సంక్లిష్టంగా, వివరంగా వివరించడానికి, కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నేను గట్టిగా అభ్యర్థిస్తున్నాను..." అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు కూడా తాజా పరిస్థితులపై ప్రజలకు తెలియజేసేందుకు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






