- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భారత్ దెబ్బకు పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం.. అప్పుకోసం అర్థిస్తూ ట్వీట్

దిశ, వెబ్డెస్క్: ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాకిస్థాన్కు దిమ్మతిరిగి బొమ్మ కనబడుతోంది. గురువారం ఆ దేశంపై జరిపిన దాడులతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి, తిరిగి అవి ఇప్పట్లో మళ్లీ కోలుకోలేని స్థాయిలో నష్టం వాటిల్లింది. అయితే, సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని కోరుతూ.. ప్రపంచం ముందు పాకిస్థాన్ భిక్షం ఎత్తుకుంటోంది. భారత్ ఆకస్మిక దాడులతో భారీ నష్టాలు వచ్చాయని పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందంటూ ప్రపంచ బ్యాంక్ను ట్యాంగ్ చేస్తూ పాక్ ఆర్థిక వ్యవహరాల విభాగం ‘X’ వేదికగా చేసిన పోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. భారత్తో పెట్టుకుని తాము అన్ని విధాలుగా నష్టపోయామని తెలిపారు. యుద్ధం తీవ్రతరం అవుతోందని.. మా వద్ద ఉన్న నిల్వలు అడుగంటాయని అన్నారు.
ఈ ఉద్రిక్తతలు తగ్గించడంలో భాగంగా అంతర్జాతీయ భాగస్వాములు తమకు సహకారం అందజేయాలని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే, ప్రపంచ వ్యా్ప్తంగా అప్పులు తీసుకుని పాకిస్థాన్, భారత్తో యుద్ధంలో తలపడేందుకు యోచిస్తోంది. అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాడుతోంది. గతంలో పేదరిక నిర్మూలన పేరుతో రుణాలు తీసుకుని ఉగ్రవాదానికి పాక్ నిధులు మళ్లించింది. ఈ మేరకు ఇవాళ ఐఎంఎఫ్ (IMF) సమావేశంలో 1.30 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్పై నిర్ణయం తీసుకోనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో నిధులు ఇవ్వొద్దని భారత్ తన వాయిస్ను వినిపిస్తుంది.
కాగా, కొవిడ్ తర్వాత పాకిస్తాన్ ఎకానమీ పూర్తిగా కుదేలైంది. ఆ దేశం ఇప్పటికే అప్పు్ల్లో కూరుకుపోయింది. పాక్ వద్ద 15 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండగా.. భారత్ దగ్గర 688 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నాయి. ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే పాకిస్తాన్ రూపాయి విలువ కూడా తక్కువే.. మన ఒక్క రూపాయి పాకిస్తాన్కు దాదాపు 3 రూపాయిలతో సమానం.