PM Modi: పాక్ దాడులపై ప్రధాని మోడీ నిరంతర సమీక్షలు.. రాష్ట్రాలకు కీలక సూచన

by Prasad Jukanti |   ( Updated:2025-05-09 05:09:01.0  )
PM Modi: పాక్ దాడులపై ప్రధాని మోడీ నిరంతర సమీక్షలు.. రాష్ట్రాలకు కీలక సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం టెన్షన్ పెట్టిస్తోంది. ఇరు దేశాల మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భారత భూభాగంలోని సరిహద్దు జిల్లాల్లోని సామాన్య పౌరులే టార్గెట్ గా విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్న దాయాది దేశం కుతత్రాలను (Pak Attacks) ఎదుర్కొనేందుకు భారత సైన్యం అప్రమత్తంగా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పాక్ పై భారత్ ప్రతిదాడులను ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Modi) నిశితంగా పరిశీలిస్తున్నారు. నిరంతర సమీక్షలు (Modi Reviews) నిర్వహిస్తూ తాజా పరిస్థితిని తెలుసుకుంటున్నారు. గత రాత్రి నుంచి కూడా ఢిల్లీలో పీఎం వివిధ విభాగాల అధిపతులతో నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రధానికి త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాలకు సూచించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య స్పష్టమై సమచార వ్యవస్థ, సంసిద్ధత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

త్రివిధ దళాధిపతులతో రక్షణశాఖ మంత్రి సమావేశం:

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో భేటీ అయ్యారు. గత రాత్రి పాకిస్తాన్ జరిపిన దాడులతో జమ్మూకాశ్మీర్ సహా సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, సైనికులు స్పందించిన తీరు, చేపట్టాల్సిన చర్యలపై రాజ్ నాథ్ సింగ్ ఈ సమీక్షలో చర్చించారు. పాకిస్తాన్ జరుపుతున్న దాడుల నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం పలు కీలక సమావేశాలు నిర్వహించబోతున్నది.



Next Story

Most Viewed