Operation Sindoor : యుద్ధానికి మనం కారణం కాకూడదు కానీ యుద్ధమంటూ వస్తే మొదటి బాణం మనదే కావాలి.. శత్రువు గుండెను చీల్చాలి..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-09 13:08:41  IST  )

భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలో గరికపాటి నరసింహ రావు గారి ప్రవచనం వైరల్ అవుతుంది. ‘

Operation Sindoor : యుద్ధానికి మనం కారణం కాకూడదు కానీ యుద్ధమంటూ వస్తే మొదటి బాణం మనదే కావాలి.. శత్రువు గుండెను చీల్చాలి..
X

దిశ, ఫీచర్స్ : భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలో గరికపాటి నరసింహ రావు గారి ప్రవచనం వైరల్ అవుతుంది. ‘యుద్ధానికి మనం కారణం కాకూడదు కానీ యుద్ధమంటూ వస్తే మొదటి బాణం మనదే కావాలి. బతకనీయొద్దు శత్రువులని. అదే రాజనీతి’ అని చెప్తూ శ్రీ రామచంద్రుల వారిని ఉదహరించారు. శత్రువు గుండెల మీద కూర్చుని జయించాలి.. రాముడు రావణాసురుని జయించింది ఎక్కడ.. హోమ్ పిచ్‌లో కాదు.. లంకకు వెళ్లి కొట్టాడు దెబ్బ. అయోధ్యకు రా కొడుతా, కిష్కింధకు రా కొడుతా అనలేదు.. లంకకు వెళ్లి కొట్టాడు. అది రామాయణం మనకు నేర్పింది. చేతులు ముడుచుకుని కూర్చోమన్లేదు.

అలాగని మనం ఎవరికి అన్యాయం చేయకూడదు.. అందుకే శ్రీరాముడి భార్యను కాపాడుకోవడానికి యుద్ధం చేశాడు కానీ పినతల్లి రాజ్యం అడిగితే అరగంటలో అరణ్యానికి వెళ్లిపోయాడు అని వివరించాడు. మనం రామాయణం నుంచి నేర్చుకోవాల్సింది ఇదేనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండింగ్‌లోకి రాగా.. ఈ మాటలు వింటుంటే ఇప్పుడే యుద్ధానికి వెళ్లాలని అనిపిస్తుందని అంటున్నారు.

Next Story