ఆపరేషన్ సిందూర్‌పై మెగాస్టార్ సంచలన ట్వీట్.. కేవలం బొట్టు అనుకున్నారేమో.. అంటూ పవర్ ఫుల్ స్టేట్‌మెంట్

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-07 14:04:58  IST  )

పహెల్గాం టెర్రర్ ఎటాక్‌కు ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు బదులిస్తోంది భారత్. ఇప్పటి వరకు ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు జరిగాయని.. ఎక్స్‌ట్రాలు చేస్తే న్యూ ఇండియాను చూస్తారని హెచ్చరించింది.

ఆపరేషన్ సిందూర్‌పై మెగాస్టార్ సంచలన ట్వీట్.. కేవలం బొట్టు అనుకున్నారేమో.. అంటూ పవర్ ఫుల్ స్టేట్‌మెంట్
X

దిశ, ఫీచర్స్ : పహెల్గాం టెర్రర్ ఎటాక్‌కు ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు బదులిస్తోంది భారత్. ఇప్పటి వరకు ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు జరిగాయని.. ఎక్స్‌ట్రాలు చేస్తే న్యూ ఇండియాను చూస్తారని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ప్రముఖులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వ చర్యలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో భాగంగానే మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ పవర్‌ఫుల్ ట్వీట్ చేశారు. దటీజ్ సిందూర్ అని చెప్తున్నారు.

‘‘మేము సిందూర్ కేవలం సంప్రదాయంగా మాత్రమే ధరించలేదు. మా అచంచలమైన సంకల్పానికి చిహ్నంగా చూశాం. మమ్మల్ని సవాలు చేస్తే భయపడుతామనుకుంటున్నారేమో.. మరింత బలంగా ఎదుగుతాం. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం, BSF‌కు చెందిన ప్రతి బ్రేవ్ హార్ట్‌కు సెల్యూట్. మీ ధైర్యం మా గర్వానికి ఇంధనంగా నిలుస్తుంది’’ అంటూ ట్వీట్ చేశాడు మోహన్‌ లాల్. దీనిపై స్పందిస్తున్న భారతీయులు.. ‘‘బాధను బలంగా మార్చుకున్న సైనికులకు సలామ్’’, ‘‘జై హింద్’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Click For Tweet..

Next Story