పాక్‌కు బుద్ధి చెప్పాలని సైన్యానికి ఆదేశాలిచ్చాం.. విక్రమ్ మిస్రీ ప్రకటన

by Gantepaka Srikanth |   ( Updated:2025-05-10 17:47:48.0  )
పాక్‌కు బుద్ధి చెప్పాలని సైన్యానికి ఆదేశాలిచ్చాం.. విక్రమ్ మిస్రీ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్(Pakistan) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ(Vikram Misri) తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని అన్నారు. ఎల్‌వోసీ దగ్గర కాల్పులు జరిపిందని తెలిపారు. డీజీఎంవో మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదని అన్నారు. తాజా పరిణామాలను ఆర్మీ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. సైనికులు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించకుండా పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యల పట్ల కఠినంగా ఉండాలని భారత సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్ ఏ రేంజ్‌లో దాడి చేస్తే.. మనం కూడా అదే రేంజ్‌లో దాడి చేయాలని ఆదేశించారు.

ఇదిలా ఉండగా.. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్తాన్‌లోని పెషావర్, చాంబ్ సెక్టార్‌పై దాడులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. భారత్ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్ ప్రతిదాడిని ఎదుర్కోవడంలో పాకిస్తాన్ విఫలం అయిందని ఆ దేశ పౌరులు విమర్శిస్తున్నారు. కనీసం బ్లాక్ అవుట్ విధించకపోవడంతో మండిపడుతున్నారు.



Next Story

Most Viewed