- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భారత వాయుసేన దాడులు.. పాకిస్థాన్లో చమురు సంక్షోభం

దిశ, వెబ్డెస్క్: భారత వైమానిక దాడులతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతోన్న పాక్కు మరో పెద్ద కష్టమే వచ్చి పడింది. దేశ వ్యాప్తంగా చమురు నిల్వలు ఒక్కసారిగా అడుగంటాయి. ఇక రాజధాని ఇస్లామాబాద్లో 48 గంటల పాటు అన్ని పెట్రోల్ బంక్లను మూసివేశారు. పాక్ ప్రధాన ఎయిర్బేస్లపై ఇండియన్ ఆర్మీ దాడులతో చేయడంతో తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇంధన కొరతతో పాటు దేశ వ్యాప్తంగా సంక్షోభ భయం అక్కడి ప్రజలను ప్రతిరోజు వెంటాడుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్పై ఇవాళ్టి నుంచి రేషన్ విధానాన్ని ప్రకటించింది.
గురువారం ఆ దేశంపై భారత్ జరిపిన దాడులతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని కోరుతూ.. పలు దేశాలను పాకిస్థాన్ ఆర్థిక సాయం కోరుతోంది. భారత్ ఆకస్మిక దాడులతో భారీ నష్టాలు వచ్చాయని, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని ఏకరువు పెడుతోంది. పాకిస్థాన్ వాణిజ్య కేంద్రంగా ఉన్న కరాచీ పోర్టుపై భారత నావికా దళం భీకర దాడి చేసింది. అరేబియా సముద్రంలో మకాం వేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ క్షిపణుల వర్షం కురిపించింది. భారత్ దెబ్బకు కరాచీ పోర్టు పాకిక్షంగా ధ్వంసమైంది. అరబ్ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు ఆ పోర్టే కీలకం కావడంతో దేశంలో చమురు సంక్షోభం వచ్చినట్లుగా తెలుస్తోంది.