- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘భారతదేశం ఉన్నతంగా నిలుస్తుంది’.. ఆపరేషన్ సిందూర్ పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పోస్ట్

దిశ, వెబ్డెస్క్: జమ్మూకశ్మీర్(Jammukashmir)లో పహల్గామ్(Pahalgam Attack) వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ భారత్ భగ్గుమంది. దీంతో ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్(Pakisthan)పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సర్వత్రా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరిట పాక్ ఉగ్రమూకలపై విరుచుకుపడింది.
ఈ ఆపరేషన్లో భారత సైన్యం పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్)తో పాటు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసింది. దీనిపై భారతీయులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై దేశ ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అదేవిధంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖులంతా భారత సైనికుల ధైర్య సాహసాలను అభినందిస్తూ ఆపరేషన్ సిందూర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులంతా సైనికులకి మద్దతు తెలుపుతూ పోస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కూడా ఆపరేషన్ సింధూర్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘భారత దేశం ఉన్నతంగా నిలుస్తుంది’ అని రాసుకొస్తూ ఆపరేషన్ సింధూర్ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.