- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
India Pakistan War : పాక్ పని ఖతం.. బాలిస్టిక్ మిసైల్స్ తో దాడికి దిగిన భారత్.. పాక్ 3 ఎయిర్బేస్లు ధ్వంసం

దిశ, వెబ్ డెస్క్ : భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం(India Pakistan War) కొనసాగుతోంది. కొద్దిగా సంయమనం పాటించినప్పటికీ, పాక్ ముందుగా దాడులకు దిగితే మాత్రం.. ప్రతిదాడులు ఎవరూ ఊహించని విధంగా చేస్తోంది భారత్. సైనిక స్థావరాలపై తీవ్రంగా దెబ్బ కొడుతోంది. అయితే శుక్రవారం సాయత్రం జమ్ము కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోని 26 చోట్ల డ్రోన్లతో పాక్ దాడులకు తెగబడింది. ఉత్తరాన బారాముల్లా నుంచి దక్షిణాన భుజ్ వరకు LOC వెంట.. సాధారణ పౌరులను, సైనిక స్థావరాల లక్ష్యంగా పాక్ ఈ దాడులు జరిపింది. భారత ఆర్మీ వాటిని ధీటుగా తిప్పి కొట్టడంతోపాటు.. పాక్ లోని 3 ముఖ్యమయిన ఎయిర్బేస్ లపై బాలిస్టిక్ మిసైల్స్(Ballistic Missiles) తో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది.
శుక్రవారం అర్థరాత్రి దాటాక పాకిస్తాన్లోని రావల్పిండి(Ravalpidi) సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్(Noor Khan Airbase Attack)తోసహ.. పంజాబ్ ప్రావిన్స్ లోని చక్వాలా(Chakwala)లోని PAF మురీద్ ఎయిర్బేస్(PAF Murid Air Base), షార్కోట్(Sharokot) లోని PAF రఫిఖ్ ఎయిర్బేస్(PAF Rafiqui Air Base) లపై మిస్సైల్స్ దాడులు నిర్వహించి, విధ్వంసం చేసింది.ఈ దాడులను పాక్ సైన్యం ధృవీకరించింది. దాడుల తర్వాత ఈ ప్రాంతాన్ని మూసివేసి, దర్యాప్తు ప్రారంభించింది. కానీ ఇప్పటి వరకు ఈ దాడుల్లో జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలు అధికారికంగా వెల్లడించలేదు.
అయితే డ్రోన్ దాడులకు దిగిన పాక్ పై భారత్ క్షిపణి దాడులు చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. క్షిపణి దాడులను ఎదుర్కొనే సత్తా పాక్ ఉన్నప్పటికీ.. ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా ఎయిర్ టు సర్ఫేస్ దాడి చేసింది భారత్. ఈ టెక్నాలజీని ఇప్పటి వరకు భారత్ తప్ప ఏ దేశం వాడక పోవడం గమనార్హం.