- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టర్కీ నీచబుధ్ది.. భారత్ సాయం మరచి శత్రుదేశంతో చేతులు కలిపి

దిశ, వెబ్ డెస్క్: గురువారం భారత్లోని యూడు సరిహద్దు రాష్ట్రాల్లో పాకిస్థాన్ డ్రోన్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ డ్రోన్లను పాకిస్థాన్ టర్కీ నుండి తెప్పించుకున్నట్టు భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు. అయితే భారత్ చేసిన సాయాన్ని మరిచి టర్కీ పాకిస్థాన్ కు సాయం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. 2023 టర్కీలో భూకంపం వచ్చి తీవ్రంగా నష్టపోయింది. ఆ సమయంలో భారత్ ఆర్మీని పంపి ఆపరేషన్ దోస్త్ పేరిట 8,45,590 డాలర్ల విలువైన సామాగ్రిని అందజేసి రక్షణ చర్యలు చేసి ఆదుకుంది.
ఆపదలో ఎంతో సాయం చేసిన భారత్ను మాత్రం టర్కీ మర్చిపోయింది. భారత్కు శత్రు దేశం అయిన పాకిస్థాన్కు టర్కీ ఆయుధ సామాగ్రిని పంపిణీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చర్యలకు సిధ్దం అవ్వడంతో టర్కీ నుండి పాక్ డ్రోన్లను తెప్పించికున్నట్టు తెలుస్తోంది. మూడు విమానాల్లో డ్రోన్లతో పాటూ ఆయుధ సామాగ్రిని టర్కీ సరఫరా చేసినట్టు సమాచారం. రెండు రోజుల క్రితం కూడా ఇస్లామాబాద్కు మరో టర్కీ విమానం వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టర్కీ పాకిస్థాన్ కు సాయం చేసినప్పటికీ ఆ డ్రోన్లను భారత ఆర్మీ బూడిద చేసింది. భారత్ వద్ద ఉన్న బలమైన క్షిపణులతో గగనతలంలోనే డ్రోన్లను పేల్చివేసింది.