- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ క్రికెటర్లకు షాక్.. రావల్పిండి స్టేడియంపై భారత్ డ్రోన్ దాడి
by Ajay Maddhiboyina |
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ ఉగ్రవాదులను అంతం చేస్తుంటే పాకిస్థాన్ ఆర్మీ భారత్పై దాడులకు పాల్పడుతోంది.

X
దిశ,వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ ఉగ్రవాదులను అంతం చేస్తుంటే పాకిస్థాన్ ఆర్మీ భారత్పై దాడులకు పాల్పడుతోంది. దీంతో భారత్ కూడా ఆపరేషన్ సిందూర్ను కొనసాగిస్తూ పాక్కు చుక్కలు చూపిస్తోంది. భారత్ తాజాగా పాకిస్థాన్లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇదే స్టేడియంలో పాకిస్థాన్ సూపర్ లీగ్స్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈరోజు రాత్రి 8 గంటలకు కూడా మ్యాచ్ జరగాల్సి ఉంది. పెషావర్ జల్మి మరియు కరాచీ కింగ్స్ మధ్య ఈ మ్యాచ్ జరగాలి. కానీ డ్రోన్ దాడుల నేపథ్యంలో స్డేడియం ఒక పక్క కొంతవరకు దెబ్బతిన్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మ్యాచ్ రద్దు చేసి మిగితా మ్యాచ్ లను కరాచీలో నిర్వహించాలని పీఎస్ ఎస్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Next Story






