- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాకిస్తాన్ దాడిలో దెబ్బతిన్న ఇళ్లు.. విజువల్స్ వైరల్

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) చేపట్టి ఉగ్రస్థావరాలను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. కానీ, పాకిస్థాన్ (Pakistan) మాత్రం భారత పౌరులే లక్ష్యంగా సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లతో (Drones) దాడులకు పాల్పడుతోంది. ఈ దాడులను భారత ఆర్మీ సమర్ధవంతంగా తిప్పు కొడుతుంది. ఈ క్రమంలో డ్రోన్ల శఖలాలు ఆ ప్రాంతంలోని ఇండ్లపై పడుతుండటంతో ఇళ్లు దెబ్బతింటున్నాయి. ఇక శనివారం అర్థరాత్రి జరిగిన డ్రోన్ దాడిలో జమ్మూ జిల్లాలో పాక్ షెల్లింగ్ వల్ల పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో ప్రజలు ఇళ్లలోంచి బంకర్లకు వెళ్లి ప్రాణాలను కాపాడుకోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం పాకిస్థాన్ దాడిలో దెబ్బతిన్న ఇళ్లను జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (CM Omar Abdullah) సందర్శించారు. ఇళ్లు ధ్వంసమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.