పాకిస్థాన్‌లో మొదలైన దీపావళి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by D.Reddy |   ( Updated:2025-05-09 04:01:21.0  )
పాకిస్థాన్‌లో మొదలైన దీపావళి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం (India-Pakistan War) కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్‌లో (Operation Sindoor) భాగంగా భారత్ ఉగ్రవాదులపై దాడి చేసి.. 100 మంది టెర్రరిస్టులను హతమార్చింది. దీన్ని సహించలేని పాకిస్థాన్ దాని వక్రబుద్ధి చూపెట్టింది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతూ దాదాపు 15 నగరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్స్, డ్రోన్ల దాడి చేసింది. అయితే, భారత్ సైన్యం ఆ మిస్సైల్స్‌, డ్రోన్లను పని చేయకుండా సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలోనే పాక్‌కు బుద్ధి చెప్పడానికి భారత నావికాదళం రంగంలోకి దిగింది. పాకిస్థాన్‌లోని ప్రధాన నగరమైన కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేసింది. కరాచీ పోర్టుతో పాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భారత్ దాడులు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'పాకిస్తాన్‌లో మొదలైన దీపావళి' అంటూ భారతీయులు పాకిస్థాన్‌పై సైటర్లు వేస్తూ వీడియోలను పంచుకుంటుకున్నారు. ఈ వీడియోలకు 'ఇండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. పాక్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకు అవుతుంది' అంటూ కొందరు, 'ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ముందుంది ముసళ్ల పండుగ' అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Next Story

Most Viewed