- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాకిస్థాన్ వక్ర చర్యలను తిప్పికొట్టిన భారత్.. పొలంలో డ్రోన్ శకలాలు కలకలం

దిశ, వెబ్ డెస్క్: భారత్- పాకిస్థాన్(Bharat- Pakistan) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యాయి. ఆపరేషన్ సింధూర్(Operaration Sindoor)తో ఉగ్రసైన్యాన్ని మట్టుబెట్టిన భారత్ చర్యను జీర్ణించుకోలేని పాకిస్థాన్ ఎదురుదాడికి దిగింది. భారత సరిహద్దు ప్రాంతాల పౌరులే లక్ష్యంగా పాక్ ఆర్మీ సైన్యం దాడుల చేస్తోంది. జమ్మూకాశ్మీర్ (Jammu Kashmir), రాజస్థాన్(Rajastan), పంజాబ్(Panjab), గుజరాత్(Gujarat), ఛండీఘర్(Chandighar) టార్గెట్గా కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఇందులో భాగంగా డ్రోన్ల ద్వారా విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోంది.
అయితే పాక్ దుశ్చర్యలకు భారత్ దీటుగా సమాధానం చెబుతోంది. భారత్ భూభాగంలోకి వస్తున్న డ్రోన్ల ప్రయోగాన్ని మట్టికరిపిస్తోంది. ఎక్కడికక్కడ డ్రోన్లను కూల్చివేస్తోంది. దీంతో పలు చోట్ల డ్రోన్ల శకలాలు జనావాసాలు, పొలాల్లో పడుతున్నాయి. తాజాగా పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ జిల్లా మగ్లానీ కోట్ గ్రామంలో డ్రోన్ శకలాలు కలకలం రేపాయి. ఆకాశం ద్వారా పాక్ పంపిన డ్రోన్ను భారత్ సైన్యం ధ్వంసం చేసింది. దీంతో ఆ శకలాలు ఓ పొలంలో పడ్డాయి. ఈ మేరకు డ్రోన్ శిథిలాలను అధికారులు పరిశీలించి.. స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..భారత భూభాగంలోకి దూసుకొచ్చిన యుద్ధ విమానాలు.. కూల్చేసిన భారత ఆర్మీ