బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధిక వాయిదా

by Shiva |   ( Updated:2025-05-09 07:12:38.0  )
బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధిక వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఐపీఎల్‌-2025ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా గురువారం ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌ను ఆకస్మికంగా నిలిపివేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎపీఎల్-2025 ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతోందా.. లేక వాయిదా పడుతోందా అన్న అనుమానాలు ప్రతి ఒక్కరి మదిలో మెదిలాయి. ఈ క్రమంలో బీసీసీఐ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా లీగ్‌ దశలో భాగంగా ఇంకా 12 మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. ఇవాళ లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు కూడా రద్దు అయింది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లీగ్‌ను నిర్వహించడం మంచిది కాదని.. దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి వెల్లడించారు. వార్ టెన్షన్ అంతా సద్దుమణిగాక మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు.



Next Story

Most Viewed