- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Barder: సరిహద్దు రాష్ట్రాల్లో పవర్ కట్.. ఆ ప్రాంతంలో మరోసారి పాక్ దాడి

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాక్ (India pakisthan) ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్ (Panjab), గుజరాత్ (Gujarath), రాజస్థాన్(Rajasthan) రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల మూసివేతతో పాటు పలు భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నాయి. రాత్రి పూట పవర్ కట్ సహా కీలక చర్యలు చేపట్టాయి. రాజస్థాన్లోని జైసల్మేర్, బార్మర్, శ్రీగంగానగర్, బికనీర్, ఫలోడి జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. స్థానిక మార్కెట్లు సాయంత్రం 5 గంటల వరకే క్లోజ్ చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇక్కడ పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాక బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు. ఇక, పంజాబ్లోని అమృత్ సర్, గురుదాస్పూర్, పఠాన్కోట్, ఫిరోజ్పూర్, ఫాజిల్కా, టార్న్ తరణ్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం అమృత్ సర్ లో పాక్ డ్రోన్ దాడి చేయగా భారత్ దానిని ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఘటనా ప్రాంతంలో భద్రతను మరింత పెంచారు.
చండీగఢ్లో ఎయిర్ సైరన్
యుద్ధ వాతావరణం మధ్య చండీగఢ్లో వైమాణిక దాడుల సైరన్లు మోగుతున్నాయి. సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుంటంతో మానిక దాడులు జరిగే అవకాశం ఉందని ప్రజలను ఎయిర్ ఫోర్స్ హెచ్చరించింది. ఎయిర్ సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని సూచించింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని వార్నింగ్ ఇచ్చింది. సరిహద్దు జిల్లాల్లోనే ఈ సైరన్లు మోగించింది.
కచ్లో డ్రోన్ దాడి
గుజరాత్లోని కచ్లో పాక్ వరుసగా రెండో రోజు డ్రోన్ దాడికి ప్రయత్నించగా భారత్ సైన్యం దానిని కూల్చేసింది. అనంతరం సరిహద్దులోని 18 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమై బాణాసంచా నిషేధం విధించింది.
ఢిల్లీలో విన్యాసాలు
ఢిల్లీలో ఎయిర్ సైరన్లు ఏర్పాటు చేయడంతో పాటు మాక్ డ్రిల్స్ చేపట్టారు. మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, పార్కులు, మెట్రో స్టేషన్లు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఢిల్లీకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడంతో పాటు బాంబు స్క్యాడ్ బృందాలు అనేక చోట్ల గాలింపు చర్యలు చేపడుతున్నాయి. దీంతో ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.