భారత్‌లోకి చొరబాటుకు యత్నం.. మరో ఏడుగురు టెర్రరిస్ట్‌లు హతం

by Shiva |   ( Updated:2025-05-09 02:40:23.0  )
భారత్‌లోకి చొరబాటుకు యత్నం.. మరో ఏడుగురు టెర్రరిస్ట్‌లు హతం
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్‌’ జీర్ణించుకోలేని దాయాది పాక్ గురువారం రాత్రి దేశంలోని పలు ప్రాంతాల్లో డ్రోన్స్ బాంబులు, మిస్సైల్స్ దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలోనే భారత నియంత్రణ రేఖ (LOC) వెంట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాక్ రేంజర్లు కాల్పులతో విరుచుకుపడుతున్నారు. సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్ పురా, అర్నియా సెక్టార్లను లక్ష్యంగా చేసుకుని పాక్ ఏకంగా ఎనిమిది మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు వాటిని యంటీ మిస్సైల్స్ సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగించి గాల్లోనే ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో భారత్‌‌లోకి అక్రమంగా చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించారు. అప్పటికే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడిందన్న భారత ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘించిందని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ వేదికగా పోస్టు చేశారు. పాక్‌ మిస్సైల్స్‌, డ్రోన్లను భారత ఆర్మీ ధ్వంసం చేసినట్లుగా పేర్కొంది.



Next Story

Most Viewed