- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రక్షణ శాఖ మరో కీలక నిర్ణయం.. రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లు

దిశ, వెబ్డెస్క్: పాకిస్థాన్తో భీకర యుద్ధానికి అడుగులు పడుతోన్న వేళ రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో భద్రతా వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేసి.. పరిస్థితులను అంచనా వేసేందుకు ఇవాళ ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్, CDSతో పాటు త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 32 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో ఇప్పటికిప్పుడు 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లను విధుల్లోకి తక్షణమే రప్పించాలని నిర్ణయించారు.
కాగా, టెరిటోరియల్ ఆర్మీ (TA) అనేది భారత సైన్యానికి సహాయక సేవలను అందించే పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడిన మిలిటరీ రిజర్వ్ ఫోర్స్. ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది ఉంటారు. వీరు భారత సైన్యంలోని వారితో సమానమైన ర్యాంక్లను కలిగి ఉంటూనే పౌర వృత్తులను కూడా నిర్వహిస్తారు.