Modi: భారత్ పై పాక్ దాడులు..మోడీ నివాసానికి అజిత్ దోవల్

by Ajay Maddhiboyina |

పాకిస్థాన్ దేశంలోని స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో వ‌రుస దాడుల‌కు పాల్ప‌డుతోంది.

Modi: భారత్ పై పాక్ దాడులు..మోడీ నివాసానికి అజిత్ దోవల్
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ దేశంలోని స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో వ‌రుస దాడుల‌కు పాల్ప‌డుతోంది. జమ్మూ క‌శ్మీర్, పంజాబ్, రాజ‌స్థాన్ లోని ప‌లు ప్రాంతాల్లో డ్రోన్ దాడుల‌తో పాటూ మిస్సైల్స్ తో దాడి చేసింది. భార‌త ఆర్మీ దాడుల‌ను అడ్డుకున్న‌ప్ప‌టికీ పంజాబ్, జ‌మ్మూక‌శ్మీర్ లో ప‌లు చోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. జ‌మ్మూలోని విమానాశ్ర‌యంపై రాకెట్ దాడి జ‌రిగింది. ప్ర‌స్తుతం ఈ ప్రాంతాల్లో యుద్ధ వాతావ‌రణం నెల‌కొన‌గా ఇప్ప‌టికే ర‌క్ష‌ణశాఖ అల‌ర్ట్ అయింది. రాజ్ నాథ్ సింగ్ రంగంలోకి దిగి తివిధ ద‌ళాల‌తో మాట్లాడారు. మ‌రోవైపు ప్ర‌ధాని మోడీకి భార‌త జాతీయ బ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ ప్ర‌స్తుత ప‌రిస్థితిని వివ‌రించారు. ఢిల్లీలో ప్ర‌ధానిని క‌లిసిన అజిత్ దోవ‌ల్ ఇండియా పాకిస్థాన్ మ‌ధ్య నెల‌కొన్న పూర్తి ప‌రిస్థితిని వివ‌రించారు.

Next Story