నాలుగేళ్ల తర్వాత ఇంటికి చేరాడు

by  |
నాలుగేళ్ల తర్వాత ఇంటికి చేరాడు
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ సత్ఫలితాలు ఇస్తోంది. ఆపరేషన్ ముస్కాన్ కారణంగా నాలుగేళ్ల తరువాత బాలుడు సొంతింటికి చేరాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన బొబ్బా శ్రీనివాస్ ఇంటి నుంచి పారిపోయి విజయవాడ చేరాడు. విజయవాడలో శ్రీనివాస్‌ను పోలీసులు చైల్డ్ హోంకి తరలించారు. అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి విద్యాబుద్దులు నేర్పుతున్నారు. ఇప్పుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆపరేషన్‌ ముస్కాన్‌‌లో భాగంగా అతని తల్లిని గుర్తించిన పోలీసులు శ్రీనివాస్‌ను ఆమెకు అప్పగించారు. నాలుగేళ్ల తరువాత కుమారుడ్ని చూసిన తల్లి శ్రీలత తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.

Next Story