ఉనికి కోసమే వారి తాపత్రయం

by  |
ఉనికి కోసమే వారి తాపత్రయం
X

దిశ, గజ్వెల్: దుబ్బాక ఉప ఎన్నికల్లో కేవలం ఉనికి కోసమే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తాపత్రయ పడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. దౌల్తాబాద్ మండలంలో చెట్ల నర్సంపల్లి గ్రామంలో ఇంటింటికి టీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెట్ల నర్సంపల్లి గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ అయిపోయాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం అని అన్నారు.



Next Story

Most Viewed