ఆర్మీ అధికారిని అంటూ రూ.42 వేలు స్వాహా

by  |
ఆర్మీ అధికారిని అంటూ రూ.42 వేలు స్వాహా
X

దిశ, ములకలపల్లి: ఆర్మీ అధికారిని అంటూ ఫేస్ బుక్ లో పరిచయమై ఓ అమాయక గిరిజనుడి నుంచి సైబర్ మోసానికి పాల్పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుట్టగూడెంలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడు కాకా ప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుట్టగూడెంకు చెందిన కాకా ప్రసాద్ కు ఇటీవల ఫేస్‌బుక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తనను తాను ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకుని తన వద్ద ఉన్న పల్సర్ బైకు విక్రయిస్తానని రూ.42,300 తన అకౌంట్ కు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. నగదు బదిలీ అయిన సమయం నుంచి ఆ వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ ఉండటంతో మోసపోయానని భావించిన ప్రసాద్ ములకలపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed