మందు పంపిణీ లేదు.. ఆనందయ్య కీలక వ్యాఖ్యలు

by  |
మందు పంపిణీ లేదు.. ఆనందయ్య కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నివారణకు ఆనందయ్య మందు కోసం ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో మందు పంపిణీ లేదని ఈరోజు తెలిపారు. మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి కృష్ణపట్నానికి ఎవరూ రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆనందయ్య. అయితే సర్వేపల్లిలో మాత్రం వాలంటీర్ల ద్వారా మందు పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో మందు పంపిణీకి ఇంకా కొంత సమయం పడుతుందని అన్నారు. అందరికీ త్వరలోనే మందు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.


Next Story

Most Viewed