- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని రైతుబజార్లలో రూ.40కే కిలో ఉల్లిపాయలు అందిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని స్వరాజ్మైదానం రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాన్ని ప్రారంభించారు. ఉల్లి ధరల పెంపును దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ రెండ్రోజుల క్రితమే ఉల్లిపాయల సేకరణకు ఆదేశాలిచ్చారని, ఈ నేపథ్యంలో మహారాష్ర్ట, ఇతర ప్రాంతాల నుంచి 6వేల క్వింటాళ్లను తెప్పించినట్లు పేర్కొన్నారు. ఇంకా అందుబాటులో ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని తీసుకొస్తామన్నారు. శనివారం నుంచి అన్ని రైతు బజార్లలో సబ్సిడీపై ఉల్లిపాయలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ కారణంగా మొత్తం 110 రైతుబజార్లను వికేంద్రీకరించి 450కి పెంచినట్లు తెలిపారు.
Next Story