సీఎం ఆదేశించాడని.. ఆమె ఒంటెపై వెళ్లి మరీ అలా చేసింది

by  |
vacsination1
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా నమోదవుతున్న విషయం కూడా తెలిసిందే. అయితే, కరోనాను నివారించేందుకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతం చేశాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నాయి. దీంతో వైద్య సిబ్బంది కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో కొన్నిచోట్లకు వెళ్లేందుకు రోడ్డు మార్గాలు కూడా లేకపోవడంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా కూడా వారు అక్కడికి వెళ్లి వ్యాక్సినేషన్ పూర్తి చేసి వస్తున్నారు. అయితే, ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా మరో ఫొటో కూడా తెగ వైరలవుతోంది. పంజాబ్ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చేసేందుకు వైద్య సిబ్బంది ఒంటెపై వెళ్లారు. ఆ సమయంలో తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను చూసిన నెటిజన్స్ ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed