చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం

by  |
చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో విషాదం నెలకొంది. పాల సముద్రం మండలం కన్యకాపురంలో ఇంటి నిర్మాణం కోసం కంకరలోడ్‌ను టిప్పర లిఫ్ట్ చేస్తుండగా పైన ఉన్న హైటెన్షన్ వైరు టిప్పర్ బాడీకి తగలింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ మనోజ్ కుమార్ (25 ) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ను కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు దొరబాబు (21) జ్యోతిష్ (19)లు కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గరు అక్కడికక్కడే చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story

Most Viewed