మక్తల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

by  |
మక్తల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
X

దిశ మక్తల్ : మహబూబ్ నగర్ లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను ట్రాక్టర్ ఢీ కొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మాగనూరు పోలీస్టేషన్ పరిధిలోని వడ్డేవాట్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వడ్డేవాట్ గ్రామానికి చెందిన నరేష్, పవన్ ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్న క్రమంలో గ్రామ వెలుపల ఉన్న శివాలయం మలుపు దగ్గర ట్రాక్టర్ బైక్ ను ఢీ కొనడంతో పవన్ (25) అక్కడికక్కడే మృతి చెందగా నరేష్(15) కు తీవ్రగాయలయ్యాయి. దీంతో అత్యవసర చికిత్స నిమిత్తం నరేష్ను జిల్లా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం నరేస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసుకు కేసునమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మక్తల్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.

Next Story