- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నల్లగొండ: పండగ పూట ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆ గ్రామస్థులంతా దసరా సందర్భంగా బంధువులు, కుటుంబీకుల మధ్య సంతోషంగా గడపగా, తెల్లవారకముందే ఓ విషాద ఘటనతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం రేగులగడ్డ గ్రామంలో శనివారం ఉదయం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సింగారపు గోపి (40)కి గత కొద్దిరోజుల నుంచి భార్యతో గొడవలు జరుగుతున్నాయి. గతంలో పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ, పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినా, గొడవలు సద్దుమణగలేదు. కాగా, గోపి ఒంటరిగానే హైదరాబాద్ లో కూలి పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైనట్టు తెలుస్తోంది. దసరా పండగ కావడంతో, రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు.
శుక్రవారం రాత్రి మద్యం సేవించి, తన ఇంటి ఆవరణలో నిద్రించాడు. దుండగలు గోపి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. తెల్లవారు జామున కుటుంబీకులు, స్థానికులు చూసే సరికే గోపి హత్య చేయబడి ఉన్నాడు. గొడ్డలి, కత్తులు, కర్రలతో కొట్టి చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే, మృతుడికి గ్రామంలో ఎలాంటి శత్రువులు లేరని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వివాహేతర సంబంధాలు, పాతకక్షల నేపథ్యంలో ఎవరైనా హత్య చేసి ఉంటారా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
- Tags
- crime