కడెం వద్ద అటవీ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తూ..

by  |
కడెం వద్ద అటవీ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తూ..
X

దిశ, ఆదిలాబాద్: చెట్టును కారు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కడెం మండలం గండి రాంపూర్ అటవీ ప్రాంతం వద్ద బుధవారం ఉదయం ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story