చెరువులో మునిగి వ్యక్తి మృతి

by  |
చెరువులో మునిగి వ్యక్తి మృతి
X

దిశ, మెదక్ : మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్‌లో చెరువులో మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రమేశ్ అదే గ్రామానికి చెందిన సిద్దిరాములుతో కలిసి గురువారం రాత్రి స్థానిక చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. రమేశ్ ప్రమాదశాత్తు కాలుజారి జేసీబీ గుంతలో పడ్డాడు. ఆయనతో వెళ్లిన సిద్దిరాములు పోలీసులకు సమాచారం అందించాడు. చెరువులో గాలింపు చేపట్టగా శుక్రవారం మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags: Medak,Ramayampeta,Ones death,pond

Next Story