పళనిలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి

by  |
పళనిలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి
X

దిశ, వెబ్‎డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని పళనిలో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ సుబ్రమణ్యం అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పళనిలో నడిరోడ్డుపై పళనిస్వామి, సుబ్రమణ్యంపై నటరాజన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సుబ్రమణ్యం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నటరాజన్ ను అరెస్ట్ చేశారు.

కాల్పులకు వాడిన రివాల్వర్ నటరాజన్‎దేనని పోలీసులు తేల్చారు. నటరాజన్‎కు గన్ లైసెన్డ్స్ రివాల్వర్ ఉందని తెలిపారు. సినిమా థియేటర్ స్థలం విషయంలో ఇబ్బంది పెట్టడం వల్లే వారిపై కాల్పులు జరిపినట్లు నటరాజన్ తెలిపారు. తన ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపానని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed