ప్రాణం తీసిన సత్తుపల్లి బస్సు

by  |
ప్రాణం తీసిన సత్తుపల్లి బస్సు
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీకొని బైక్‌పై వెళ్తున్న అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని చివ్వెంట మండల శివారులోని రవీంద్రపార్ భాయిల్ ఎదురుగా సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న మరో మహిళకు, బాలుడికి గాయలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుగా పోలీసులు గుర్తించారు.


Next Story

Most Viewed