ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

by  |
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
X

దిశ, భద్రాచలం: తెలంగాణకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందారు. శుక్రవారం బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొర్సగూడ-మెట్‌పల్లి నడుమ అటవీప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నారన్న సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశంతో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు (డీఆర్‎జీ) , సీఆర్‌పీఎఫ్ 168 బెటాలియన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. పోలీసుల ధాటికి తట్టుకోలేక మావోయిస్డులు అడవిలోకి పారిపోగా, కాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు ఒక మావోయిస్డు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపారు.‌


Next Story

Most Viewed