దారి కోసం దాడి చేశారు

by  |
దారి కోసం దాడి చేశారు
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లా ఖిలా వరంగల్‌లోని వసంతనగర్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. దారి కోసం ఇరు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో రక్తం చిందింది. మహిళలు అని చూడకుండా ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. కర్ర దెబ్బలు తాళలేక నెల పై పడిపోయినా కూడా జాలిలేకుండా విచక్షణ రహితంగా కొట్టారు. ఈ దాడిలో ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి సంబంధించిన వీడియోలు స్థానికులను భయంభ్రాంతులకు గురి చేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


Next Story

Most Viewed