కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. శిథిలాల కింద..

by  |
కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. శిథిలాల కింద..
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలోని ముంబై నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున బాండ్రా ప్రాంతంలో ఒక్కసారిగా నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. బాండ్రా ఎమ్మెల్యే జీషాన్ సిద్దిఖీ ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.


Next Story