నిండు ప్రాణం బలిగొన్న నిర్లక్ష్యం

by  |
నిండు ప్రాణం బలిగొన్న నిర్లక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్ : డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట మండలం వినాయకపురంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన వెలుగుచూసింది. బ్రిడ్జి గోడను ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed