కారు-బైక్ ఢీ: ఒకరు మృతి

by  |
కారు-బైక్ ఢీ: ఒకరు మృతి
X

దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా నాగారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన గూనె సతీష్, గూనె లింగస్వామి ఇద్దరు బైక్‌పై‌ ఫణిగిరికి వెళ్లి తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో జాజిరెడ్డిగూడెం జడ్పీటీసీ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో గూనె లింగస్వామి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి సతీష్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సతీష్‌ను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed