కేన్సర్​ పెరిగిందని ఆంకాలజిస్టుల ఆందోళన

by  |
cancer Run
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కేన్సర్​ వ్యాధి పెరుగుతున్నట్లు గ్రేట ర్​హైదరాబాద్‌‌కు చెందిన పలువురు ఆంకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపంతో చాలా మంది వ్యాధిని ఆలస్యంగా గుర్తిస్తున్నారని, దీంతో చికిత్స అందించడం కష్టమవుతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్‌ఎమ్‌డీసీ గ్రేస్‌ కేన్సర్‌ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో కేన్సర్​ అవగాహన ర్యాలీ జరిగింది.

ఈ సందర్భంగా ఆంకాలజిస్టులు మాట్లాడుతూ కేన్సర్‌ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే జయించడం పెద్ద కష్టమేమికాదన్నారు. మొదటి, రెండో దశలో గుర్తిస్తే కొన్ని రకాల మందులతో వ్యాధిని తగ్గించవచ్చన్నారు. అయితే వ్యాధి నియంత్రణకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా కలసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోగికి ఆర్థిక భారం పడకుండా ఆదుకోవాలన్నారు.

ఈ మేరకు గత కొన్ని రోజుల నుంచి గ్రేస్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రజల్లో కేన్సర్‌పై అవగాహన కలిగించేందుకు, దాని నివారణకు వివిధ రకాల కార్యక్రమాలు చేయడం మంచి పరిణామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు చిన్నబాబు, ప్రమీల, సుబిత్​ దూబే, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed