అడవిలో కాల్పులు.. పరుగు అందుకున్న ఎమ్మెల్యే (వీడియో)

by  |
MLA Running
X

దిశ, వెబ్‌డెస్క్ : సమస్యను పరిష్కరిస్తానని వెళ్లిన ఎమ్మెల్యే ఘటన స్థలికి వెళ్లక ముందే ఉన్నపళంగా వెనుదిరిగాడు. ఎక్కడో వినబడిన శబ్ధానికి పరుగు అందుకున్నాడు. ఎమ్మెల్యేను చూసి అప్పటి వరకు ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ఆయన పరుగులో అడుగు కలిపారు. అస్సాంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అస్సాం జిల్లాలైన చారిడియో, శివసాగర్, జోర్హాట్, గోలఘాట్, కర్బి అంగ్లాంగ్​లు నాగాలాండ్‌తో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఈ సరిహద్దు ప్రాంతాల్లో నాగాలాండ్​ దురాక్రమణలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరియాని ఎమ్మెల్యే రూప్​జ్యోతి కుర్మి తన సిబ్బంది, కొందరు మీడియా ప్రతినిధులతో కలిసి దేసో వ్యాలీ రిజర్వ్ ఫారెస్ట్​కు వెళ్లారు. అక్కడి ఆక్రమణలను పరిశీలిస్తున్న టైంలోనే తుపాకుల మోత వినిపించింది. దీంతో ఎమ్మెల్యే పరుగులు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

కాగా, తనను టార్గెట్​ చేసే ఆ కాల్పులు జరిగాయని కుర్మి తెలిపారు. అయితే అదృష్టవశాత్తు తామంతా కాల్పుల నుంచి తప్పించుకున్నామని, సమస్యను పరిష్కరించేందుకు అస్సాం ప్రభుత్వం నాగాలాండ్ సర్కారుతో మాట్లాడటం లేదని కుర్మి ఆరోపించారు. కాగా, ఈ కాల్పుల్లు ముగ్గురు రిపోర్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.ఈఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. వెంటనే అక్కడి పరిస్థితులపై పరిశీలించాలని సీనియర్ పోలీసు అధికారి జీపీ సింగ్‌ను ఆదేశించారు. దీంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.

Next Story

Most Viewed