భారత్‌లో ఒమిక్రాన్ డేంజర్ బెల్స్.. భారీగా పెరిగిన కేసులు

by  |
Omicron
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా ప్రవేశించింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236కు చేరుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఓ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా ఒమిక్రాన్ నుంచి 104 మంది కోలుకున్నట్టు తెలిపింది. ఇదిలా ఉండగా దేశంలో గురువారం కొత్తగా మరో 7,495 క‌రోనా కేసులు న‌మోద‌ు అయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 6,960 మంది కోలుకున్నారు. కరోనాతో మరో 434 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story