ఒమిక్రాన్ టెన్షన్.. దేశంలో ఐదుకు చేరిన పాజిటివ్ కేసులు

by  |
ఒమిక్రాన్ టెన్షన్.. దేశంలో ఐదుకు చేరిన పాజిటివ్ కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ వేరియంట్‌తో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆదివారం మరో పాజిటివ్ కేసు రికార్డుల్లో చేరింది. ఆదివారం ఉదయం ఢిల్లీలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. టాంజానియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు వెల్లడించారు.

దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఇప్పటికే కర్నాటకలో రెండు, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed