ఒంటరితనం భరించలేక ఆత్మహత్య

by  |
ఒంటరితనం భరించలేక ఆత్మహత్య
X

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒంటరితనం భరించలేని ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మానుకొండూరు మండలం ఊటూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముచ్చంతల వెంకటమ్మ(60) భర్త వెంకట్ రెడ్డి ఇటీవల మరణించాడు. దీంతో కూతుర్లు ఐదు నెలల పాటు తల్లి వెంకటమ్మ వద్దే ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె కూతుర్లు మెట్టినిళ్లకు వెళ్లారు. దీంతో ఒంటరితనం భరించలేకపోయిన వృద్ధురాలు బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.



Next Story

Most Viewed